ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం…
రుద్రూర్, జూన్ 21 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు, విద్యార్ధినులచే బస్టాండ్ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. యోగ దినోత్సవం సందర్భంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, యోగా బృందం సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు.