
ఉపాధి హామీ నర్సరీ పనుల ప్రారంభం
సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్
పయనించే సూర్యుడు జనవరి 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతామని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ ఫీల్డ్ అసిస్టెంట్ భూక్య నరసింహారావు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.