
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి: తానూర్ (ఝరి):మహాత్మా జ్యోతిరావ్ పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలతో సమాజ మార్పు కోసం, శ్రామిక, బహుజన ప్రజల హక్కుల కోసం తన కలం ద్వారా పోరాడిన గొప్ప విప్లవ రచయిత, సాహిత్యరత్న డాక్టర్ అన్నాభావూ సాఠే వర్ధంతి వేడుకలను రేపు (జూలై 18న) తాలూకా/మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నాభావూ సాఠే కమిటీ సభ్యులు గాయకవాడ్ సాయినాథ్ (ఝరి) ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అణచివేతకు గురైన వర్గాల చైతన్యం కోసం అన్నాభావూ సాఠే చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, రేపు నిర్వహించే ఈ వర్ధంతి కార్యక్రమానికి తాలూకా పరిధిలోని మాదిగ సమాజం, బహుజన బంధువులు, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా గాయకవాడ్ సాయినాథ్ కోరారు.