
మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కేశంపేట మండల పరిధిలోనీ కాకునూర్ గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీలను ప్రారంభించారు. బండ లాగుడు పోటీలొ అంతర్ రాష్ట్ర ఒంగోలు గీత్తలు మరియు నగర్ కర్నూల్. నంద్యాల వాసుల గీత్తలు పోటీలలొ పాల్గొన్నారు.మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు పాల్గొన్న కేశంపేట మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మరియు కేశంపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఆల్వాల్ సర్పంచ్ సురేష్ రెడ్డి మండల నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.