పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 గొల్లపల్లి మండల ప్రతినిధి ఆవుల చంద్రశేఖర్
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ డీసీఆర్బీలో పని చేస్తున్న ఎస్ఐ శ్వేతతో పాటు ద్విచక్రవాహనంపై ఉన్న వాహనదారుడు దుర్మరణం చెందారు.. ధర్మారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఎస్ఐ శ్వేత ముందుగా వస్తున్న ద్విచక్రవాహనం రెండు ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు.. కారు అతి వేగంగా ఉండటంతో ప్రమాదం తర్వాత కారు రోడ్డుకు కిందికి దూసుకెళ్లింది.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. మృత దేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..డీసీఆర్బీ జగిత్యాలలో పని చేస్తున్న ఎస్ఐ శ్వేత.. గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లి ఎస్ఐగా పని చేశారు మృతుడు మల్యాల నరేష్(26)
స్వగ్రామం కొండగట్టు మల్యాల..
మంచిర్యాల జిల్లా లక్షెట్టి పేట పట్టణం లోని DBS బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు