
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
బైర్ ఖాన్ పల్లిలో లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి అపార కృపాకటాక్షాలతో సమస్త ప్రజల హృదయాల్లోని శుభకోరికలు నెరవేరి,ప్రతి ఇంటిలో ఆనందం,ఐశ్వర్యం,ఆరోగ్యం,శాంతి సమృద్ధిగా వెల్లివిరియాలి కోరుకున్నారు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.కేశంపేట మండలం బైర్ఖాన్ పల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్సి నవీన్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం బండ లాగుడు పోటీలను వీక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శమంతా యాదయ్య,మాజీ సర్పంచ్లు కృష్ణయ్య,యాదగిరి రావు, వెంకటయ్య,కృష్ణయ్య,సర్పంచ్ తనయుడు శివ కుమార్,
ఉపసర్పంచ్ ధన్సిగ్,తొమిది రేకుల మాజీ ఎంపిటిసి యాదయ్య,మాజీ ఉప సర్పంచ్ రామ్ రెడ్డి,నిడదవెల్లి నాగరాజు, బైర్ ఖాన్పల్లి వార్డ్ మెంబెర్స్ లక్ష్మి రాజు,వసంతవెంకటేష్ ,యాదగిరి,గోవింద్,అశ్విని ప్రకాష్,మాజీ ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్, నాయకులు బాలరాజ్,వెంకటేష్,శ్రీను,రాజేందర్,రాజు,సిద్దు,శ్రీకాంత్,రఘు,అఖిల్,ద్రోణచారి, యాదగిరి రావు,వరమా వెంకటయ్య,శేఖర్,చందు ,హన్మంతు, భాస్కర్,అశోక్,విక్రమ్,తదితరులు పాల్గొన్నారు.