రుద్రూర్, సెప్టెంబర్ 6 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంఈఓ శ్రీనివాస్, మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ చెన్నప్పకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేవి.మోహన్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, గాండ్ల మధు, తదితరులు పాల్గొన్నారు.