విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేస్తున్న దృశ్యం..
రుద్రూర్, మార్చ్ 19 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థిని, విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లయన్ లంక రవి, బోధన్ కెనరా బ్యాంకు మేనేజర్ సునీల్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలను కొనియారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ప్రెసిడెంట్ కే.వి. మోహన్, పాఠశాల హెడ్మాస్టర్ రామ్ సింగ్, లైన్స్ క్లబ్ ప్రతినిధులు శ్యామ్ సుందర్ పహడే, పుట్టి సాగర్, ప్రశాంత్ గౌడ్, షామీర్, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.