
ఎమ్మెల్యే శంకర్ కు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు స్వాగతం
మాజీ ఎమ్మెల్యే బక్కని, ఎమ్మెల్యే శంకర్ ల అన్యోన్యత
లింగారెడ్డిగూడెం సర్పంచ్ ఎంసి రాజు, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ ల కృతజ్ఞతలు
రూ.30 లక్షలతో సిసి రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
( పయనించే సూర్యుడు మార్చి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఇందిరమ్మ ఇల్లు గూడు లేని నిరుపేదలకు వరాల జల్లు అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో బుధవారం గృహప్రవేశం అంగరంగ వైభవంగా చేయించారు.కార్యక్రమం కోసం లింగారెడ్డిగూడెం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రావడంతో గ్రామవాసి స్థానిక మాజీ ఎమ్మెల్యే టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ తన ఆప్యాయతను చాటారు.ఎమ్మెల్యే శంకర్ సైతం అంతే వినమ్రంగ ఆయనకు నమస్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి ఆశీస్సులు అందించారు. అనంతరం మాట్లాడుతూ నిరుపేదలను ఇంటి యజమానులను చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దానిని అంకితభావంతో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటిని అందించి వారికి గూడు చూపించే కార్యక్రమం మంచి కార్యక్రమం అని అభినందించారు. సర్పంచ్ ఎంసీ రాజు, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రగతి పనులకు శంకుస్థాపన..అదేవిధంగా గ్రామంలో 30 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. వార్డు సభ్యులు మల్లేష్ యాదవ్, దీపిక, వీరేష్ గౌడ్, మమత, అరుణ్, సాయికుమార్, బాలమణి, యాదయ్య, మాధవి, గణేష్, మెహరాజ్, శశాంక్, గ్రామ పెద్దలు కందూరి అంజయ్య గౌడ్, రంగంపల్లి రమేష్, భాస్కర్ రెడ్డి, పంతులు, లక్ష్మయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, సుధాకర్, ధనాల రాజు యాదవ్, ధనుంజయ గౌడ్, పక్కని శీను, యాదయ్య గౌడ్, మంగలి మల్లేష్, శంకరయ్య, అంజయ్య ప్రతాపరెడ్డి, దాదేమియా, జంగయ్య, నారాయణ, శీను, శేఖర్, యాదగిరి, ఖదీర్ ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు..
