పయనించే సూర్యుడు జూన్ 21 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
ఏ అనుమతులు లేకున్నా పదో తరగతి చదువు చెబుదు అర్హత లేని వారితో పిల్లలు యొక్క జీవితాలను నాశనం చేస్తున్న మాధురి స్కూల్ యాజమాన్యం*
పదో తరగతి అనుమతి ఉందని చెబుతూ జనాలకు మభ్యపెడుతున్న మాధురి స్కూల్ యాజమాన్యం
అధిక ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్న మాధురి స్కూల్ యాజమాన్యం
టీసీ కోసం వెళ్తే వంద రూపాయలు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాల్సిందే అంటూ మాధురి కరస్పాండెంట్ రేపన సుధాకర్..?!!
మా పిల్లవాడిది టిసి ఇవ్వండి సారు అంటే…? వంద రూపాయలు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాల్సిందే అంటూ మాధురి స్కూల్ కరస్పాండ్
అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం మాధురి స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసుకుని ఉన్నత చదువులు కోసం మాధురి స్కూల్ దగ్గరికి వెళ్లి తల్లిదండ్రులు టిసి అడగగా టిసీ ఇవ్వాలంటే వంద రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టిసి ఇస్తాం అంటూ మాధురి కరస్పాండెంట్ రేపల సుధాకర్ మరియు యాజమాన్యం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఏం చెయ్యాలో తెలియక స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు ఈ నేపథ్యంలో మాధురి స్కూల్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మా కరెస్పాడ్ చెప్పారు బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టిసి ఇవ్వమన్నారు అని సదరు క్లర్క్ చెప్పగా తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక మాధురి స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు టీసీ కోసం వెళ్లిన తల్లిదండ్రులను కూడా ఇలానే చాలామందిని దురుస్తుగా ఇస్తాంలే అని చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు టిసికి వంద రూపాయల బాండ్ పేపర్కి ఏమైనా సంబంధం ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు విలేకరులను ఆశ్రయించగా విలేకరుల చొరవతో టిసి అందజేసిన యాజమాన్యం మాధురి స్కూల్ కి ఏ అనుమతులు లేకున్నా పదో తరగతి చదువుతూ అర్హత లేని వారితో పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తూ పదో తరగతి అనుమతి ఉందని చెబుతూ జనాలకు మభ్యపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఎన్నోసార్లు మాధవి స్కూల్ పై పలు విమర్శలు వచ్చినప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వివరించడం హాస్యసం అని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి మాధురి యజమానియం పై చర్యలు తీసుకుని పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడాలని తల్లిదండ్రులు కోరారు