పశువులను,గేదలను కట్టివేయకుండ గాలికి వదిలేస్తున్న వైనం.
పయనించే సూర్యుడు: జూన్ 30: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలో ఎండాకాలం ముగిసినప్పటికీ మూగజీవులను మేత మేపుటకు బోయిలని నియమించుకోలేని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాజేడు మండలంలోని మేజర్ గ్రామపంచాయతీగా పిలువబడే మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలో రైతన్నలు వారి ఆర్థిక ఎదుగుదల కొరకు వరి నార్లు పోసి,కొందరు కరేద అలికి, వానలు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తున్న క్రమంలో, ఎధిగిన వరి నారు మడులను మూగజీవులు అనగా ఆవులు, గేదెలు అర్ధరాత్రి సమయంలో మేస్తున్నాయని,అలాగే కాళ్ళతో తొక్కుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు,.కానీ అక్కడి గ్రామ పంచాయితీ సిబ్బందికి ఎన్నిసార్లు తమ గోడును వెళ్లగక్కకున్నప్పటికీ, ఏమాత్రం పట్టించుకోకపోగా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు బాధపడుతున్నారు.పోయిన సీజన్లో శ్రీరామనవమి నాటి నుండి ఆవులను, గేదెలను మేపకుండా ఎటువంటి పంట నష్టము లేదని, విచ్చలవిడిగా వధిలేసేసినప్పటికి, ఇప్పుడు జూన్ నెల మొదలై అలాగే పూర్తయి ప్రస్తుతం జులై నెల ప్రారంభం కాబోతున్న సందర్భంలో, స్థానిక ప్రజలు కొందరు వరి నార్లు పోసి, మరి కొందరు కరేద వరి అలికి ప్రజలు బాధతో బెంబేలెత్తిపోతున్నారు . ఇప్పటికైనా అధికారులు స్పందించి, అర్ధరాత్రి సమయంలో గ్రామాలలో,పంట పొలాలలో బీభత్సం సృష్టిస్తున్న ఆవులను గేదెలను బందెల దొడ్డిలో బంధించి, వాటి యజమానులకు తగిన జరిమానా విధించాలని, ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా కనీస అవగాహన కోసం ప్రజలకి పశువులను కట్టేయాలని పంచాయితీ కార్యదర్శి గ్రామాలలో దండోరా వేయించాలని ప్రజలు కోరారు.