పయనించే సూర్యుడు;జూన్ 28: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని వాజేడు నాగరం గ్రామపంచాయతీ లో ఇంటింటి సర్వేలో భాగంగా మలేరియా. డెంగ్యు,చికెన్ గున్యా వంటి వ్యాధులు పట్ల సర్వే నిర్వహించడం జరిగింది. డెంగ్యు వ్యాధికి కారణమైన దోమ పుట్టకుండా కుట్టకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,కాచి చల్లార్చి నీరు తాగాలని ఇంటి పరిసరాలు నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటిలో పెద్దలు పిల్లలు దోమతెర చాటున నిద్రించాలని వాజేడు ప్రభుత్వ వైద్యాదికారి డాక్టర్ మధుకర్ సూచించారు.అదేవిధంగా ఇంటింటా మలేరియా, డెంగ్యూ సర్వే నీ వైద్యాధికారి మధుకర్ పర్యవేక్షించి ఈ నెలలో నమోదైన క్షయ వ్యాధిగ్రస్తుల ఇంటి వద్దకెళ్లి పరీక్షించడం జరిగిందనీ,మురికి కుంటలు ఆశా కార్యకర్తలతో తిమోపాస్ మందు చల్లడం జరిగిందనీ తెలియజేశారు. అనం రెండు రక్తపోటుతో మధుమేహం. రక్తపూత సేకరణ రెండు ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు నాలుగు వైద్యాధికారి గా నిర్ధారణ చేయడం జరిగిందినీ తెలిపారు. ఈయొక్క కార్యక్రమంలోవైద్యదికారి మధుకర్
వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొనడం జరిగిందనీ వివరించారు.