పయనించే సూర్యుడు: జూన్ 28; ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
నూగూరువెంకటాపురం; ములుగు జిల్లా ఏజెన్సీలో నివసిస్తున్న వాడ బలిజ'లకు చెరువుల లో పెంచుతున్న చేపలపై పూర్తి హక్కులు కల్పించాలినీ,వాడ బలిజ సేవా సంఘం అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం అధ్యక్షుడు డర్ర దామోదర్ అధ్వర్యంలో, హైదరాబాద్'లోని. తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు,ఈ సందర్భంగా వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంమంతట లక్షలాది జనాభాగా నివసిస్తున్న మాకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి చెరువుల్లో, కుంటల్లో ప్రాజెక్టులలో వేసే చేప పిల్లల పెంపకం, చేపల వేట పై సాంప్రదాయ మత్స్యకారులమైన మాకు సర్వహక్కులు కల్పించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతంలో కొంత భాగం భద్రాచలం ఐటిడిఏ, ఎటురునాగారం ఐటీడీఏ పరిధిలో 1/70 యాక్ట్ అమలులో ఉన్నందున మా యొక్క వాడ బలిజ కులస్తులకు అన్యాయం జరుగుతుందనీ, తెలియజేశారు.ఎన్నో సంవత్సరాలుగా మా తాత, ముత్తాతల నుండి జీవనం సాగిస్తూ ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన మమ్మల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి మాకు న్యాయం జరిగేటట్లుగా చూడాలని, ముఖ్యంగా ప్రభుత్వం తరఫున పూర్తి విచారణ జరిపించి వందలాది సంవత్సరాలుగా నివసిస్తున్న బీసీలమైన మాకు 42 % హక్కులు కల్పించాలని, లేనియెడల జనాభా ప్రాతిపదికన ఎస్టీ జాబితాలో చేర్పించేటట్లుగా తమరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మత్స్య లైసెన్సుల విషయంలో జాప్యం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలియజేయగా వెంటనే స్పందించిన మత్స్య శాఖ చైర్మన్ ఫోన్ లైన్ లో సంబంధిత ములుగు జిల్లా అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకోగా చట్టపరమైన అడ్డంకులు ఏమైనా ఉంటే మార్కెటింగ్ సొసైటీలు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెటింగ్ సొసైటీలు గతంలోనే ఉన్నాయని తెలియజేయగా గతంలో ఉన్నప్పుడు కొత్త సభ్యత్యాలు ఎందుకు చేర్పించుకోవట్లేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసి, వాజేడు మండలంలోని పెద్ద గొల్లగూడెం గ్రామానికి చెందిన 191 పైళ్ల విషయం గత ఆరు నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరిగిన పట్టించుకోవట్లేదని తక్షణమే మార్కెటింగ్ సొసైటీలో చేర్పించాలని సూచించారు. గోదావరి ప్రాంతంలోని జిల్లాలోని ప్రతి మండలం నుంచి సభ్యత్వాలు తీసుకొని ఒక సెట్ జిల్లా అధికారికి, మరో సెట్ హైదరాబాద్ తన కార్యాలయానికి కి పంపించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు మండలాల కలిపి ఒకటే సొసైటీ ఉండడం ఏమిటని వెంటనే అది విడదీసి ఏ మండలం ఆ మండలానికి మత్స్య సొసైటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు మెట్టు ధనరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోట ప్రశాంత్, వాజేడు మండల యూత్ ప్రెసిడెంట్ బొల్లె విజయబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు కొప్పుల రామకృష్ణ, అల్లి నరేష్, ముత్తబోయిన ప్రసాద్, అల్లి రాంబాబు, గగ్గూరి క్రిష్ణార్జునరావు, కొప్పుల మల్లికార్జునరావు, మెట్టుబెల్లి సుధాకర్, కొప్పుల నారాయణ, కొప్పుల అబ్బాయి, తదితరులు పాల్గొన్నారు.