రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో సోమవారం
ఈ రోజు వేల్పూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న గోదావరి ఇల్లు పనులను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది.
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఇల్లు లేని పేదల బాధలు విన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని అందులో భాగంగానే వేల్పూర్ మండలంలో గోదావరి తమకు సొంత ఇల్లు ఉండాలని కలను నెరవేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలనే కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించడమే కాకుండా ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యే విధంగా అధికారులను ఆదేశించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తమ తమ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం అయ్యేవిధంగా వారికి సహాయం అందించాలని ఆయన తెలిపారు.పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించే ప్రక్రియలో ఎక్కడ కూడా పార్టీ బేధాలు,తమ మన బేధాలు చూడటం లేదు అని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తామని వారిని మోసం చేసిందని కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుంది అని ,10 సంవత్సరాల కంటే ముందు ఇందిరమ్మ ఇండ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఇప్పుడు కూడా మల్లి కాంగ్రెస్ పార్టీనే ప్రతి గ్రామంలో పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తుంది అని ఆయన అన్నారు కేటీఆర్ మాట్లాడుతూ 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మాట్లాడుతున్నాడని, హైదరాబాద్లో ఉంటూ డ్రగ్స్ వ్యవహారంలో ఉంటే గ్రామాలలో జరిగే అభివృద్ధి ఏమి తెలియదని కావున కేటీఆర్ గ్రామాలలో తిరగాలని అంతేకానీ ముఖ్యమంత్రి పై అవక్కులు చెవక్కులు చేస్తే ఊరుకునేది లేదు అని మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ జిల్లా జనరల్ సెక్రెటరీ దామోదర్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేష్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు రమణ రాజేందర్ రాజేశ్వర్ లావణ్య లహరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు