పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదవీకాలం 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వికాసిత్ భారత్ అమృత్ కాల్ _ సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా భీంగల్ పట్టణ బిజెపి కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షులు కనికరం మధు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతన మొర్చాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అందులో ఎస్సీ మోర్చాఅధ్యక్షుడిగా పిరి గంగాధర్, మైనారిటీ మోర్చా ఎండి ఉస్మాన్, కిసాన్ మోర్చా నీలం గంగాధర్, ఎస్టి మోర్చా బండి నరసయ్య, ఓబీసీ మోర్చా మోహన్ మరియు యువ మోర్చా రాగి అజయ్ లను ఎన్నుకోవడం జరిగింది అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నరసయ్య జిల్లా ఓబిసి ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్ , సీనియర్ నాయకులు ములిగే మైపాల్ మరియు శక్తి కేంద్ర ఇన్చార్జులు బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది