
జనం న్యూస్, జూలై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లిలోని రామాలయం గుడి సమీపంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ శాంతినగర్ బ్రాంచ్లో నిర్వహించిన స్కూల్ క్యాబినెట్ ఎన్నికలను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పాఠశాల ప్రిన్సిపాల్ మృణాళినితో కలిసి ప్రారంభించారు. ప్రజాస్వామ్య విలువలను చిన్ననాటి నుంచే విద్యార్థులకు పరిచయం చేస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో ఈ ఎన్నికలను నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్య విధానాలపై అవగాహన కల్పించడం, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడం ఈ ఎన్నికల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఎన్నికల ప్రక్రియను పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపారు.ఎన్నికల్లో పోటీ చేసిన విద్యార్థులు తమ సహ విద్యార్థులకు తమ ఆలోచనలు, ప్రణాళికలను వివరించగా, విద్యార్థులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఓట్ల లెక్కింపు అనంతరం విజేతలుగా ఎన్నికైన విద్యార్థులు పాఠశాల అభివృద్ధి, క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఆదర్శ నాయకత్వాన్ని ప్రదర్శించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పద్మజ, రాజేష్ చారి, జాహ్నవి, భరత్, శాస్త్రికతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేశారు.