
పయనించే సూర్యుడు గాంధారి 03/09/26విశ్వబ్రాహ్మణులు అని రంగాల్లో ముందు ఉండాలని సంఘం జిల్లా అధ్యక్షుడు దేమె రాజు చారి అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని స్థానిక హారాలే గార్డెన్స్ లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఆయన విచ్చేశారు. ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా స్థాయినాయకులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు విశ్వబ్రాహ్మణ జెండా ఎగరవేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం దీనిని గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కులాల వారు రాజకీయంగాముందు ఉన్న కేవలం విశ్వబ్రాహ్మలు మాత్రం ఏ రంగంలో లేకుండా వెనకబడి ఉండడాన్ని ప్రభుత్వం గుర్తించి సరైన ప్రోద్బలాన్ని అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాతో పాటు రాష్ట్రంలో కొన్ని గ్రామాలలో మాత్రమే సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలుపొందారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండి మన డిమాండ్ లను సాధించుకునే విధంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలోవిశ్వబ్రాహ్మణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్ల భీమయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్ల సిద్ధిరాములు, గాంధారి మండల అధ్యక్షుడు కమ్మరి సురేష్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అవుసుల రాజు చారి, గాంధారి సంఘం అధ్యక్షుడుకమ్మరి పండరి, జిల్లా మాజీ అధ్యక్షుడు పుండరీ చారి, మండలంలోని అన్ని గ్రామాల సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.