షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
అవార్డు గ్రహీత డాక్టర్ మిరియాల వెంకటరమణను సన్మానించిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు జూన్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లు ప్రజలకు మెరు గైన వైద్య సేవలు అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మిర్యాల వెంకటరమణ ఇటీవల ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నేత కృష్ణారెడ్డి, సుదర్శన్ గౌడ్, మహమ్మద్ ఇబ్రహీం తదితరులు డాక్టర్ మిర్యాల వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు చేస్తున్న మేలైన సామాజిక సేవలను గుర్తించడం శుభపరిణామన్నారు. దీంతో వైద్యులకు మరింత బాధ్యత పెరిగిందని, ప్రతీ రోగి డాక్టర్లను దేవుళ్లుగా భావించి వైద్యం కోసం వస్తుంటారని, అలాంటి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైద్య వృత్తికి వన్నె తీసుకురావాలని కోరారు. డాక్టర్ ను సన్మానించిన వారిలో కాంగ్రెస్ నాయకులు అగనూరు బస్సు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, పార్లమెంటరీ నాయకులు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు..