పట్టించుకోని అధికారులు…
రుద్రూర్, జనవరి 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని 9 వ వార్డులో గల వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరి, పెచ్చులు ఊడిపోయాయని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని కాలనీవాసులు భయందోలనకు గురవుతున్నారు. ఈ శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ గురించి అధికారులు కూడా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ వాటర్ ట్యాంక్ కు గత ఇదేళ్ల నుండి మెట్లు కూడా లేవని, కలుషితమైన త్రాగునీరు వస్తుందని కాలనీవాసులు తీవ్రంగా మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ పై దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.