
పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి శంషిగూడలోని నక్షత్ర రూప అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ యంత్ర ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తుల నడుమ భక్తి శ్రద్ధలతో సాగింది.
ఈ మహోత్సవానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, బండి రమేష్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం మూసాపేటలో కాంగ్రెస్ నాయకుడు తూము వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన శివాలయంలో శివ–పార్వతుల కళ్యాణ మహోత్సవంలో కూడా బండి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పండితుల వేద ఆశీర్వాదాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాలి బాలాజీ, గొట్టుముక్కల వెంకటేశ్వర రావు, గంధం రాజు, చిట్టిబాబు, కొప్పిశెట్టి దినేష్ కుమార్, జగదీష్, లక్ష్మి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.భక్తుల సమక్షంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రాంతంలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పాయి.
