( పయనించే సూర్యుడు జూన్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ (ఎస్ వై సి) అధ్యక్షులు అదిల్ మాట్లాడుతూ… షాద్ నగర్ యువతను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా సమాజంలో సంఘీభావ భావనను ఏర్పరచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆదిల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన షాద్నగర్ యూత్ కరేజ్ (%పాజ%) ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా వృథా ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంచడం ద్వారా ఒకవైపు పర్యావరణ సమస్యను తగ్గిస్తూ, మరోవైపు మానవతా విలువలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఆహార దానం ద్వారా మిగులు వనరులను ఉపయోగించుకుని పేదలకు భరోసా కలిగించగలిగితే అది మన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఇకపోతే ఆదిల్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించిన విశేషులు, ఆయనకు మరిన్ని అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు. ఇకపై మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, యువతకు ఆదర్శంగా నిలవాలని అధ్యక్షుడు ఆదిల్ వ్యక్తం చేశారు.