మెగా డీఎస్సీ రిజల్ట్ ప్రకటించే నాటికి షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామక చట్టం ప్రకటించాలి
ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నందుకు 35 రోజు రిలే నిరాహారదీక్షల విరమణ -
@ ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 18 షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం సాధనలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ రాష్ట్ర కమిటీ బాద్యులు ప్రభుత్వంతో మే 21, 22వ తారీకులలో మొదటి దశ సీఎంఓ కార్యాలయంతో జరిగిన చర్చల కొనసాగింపులో రెండవసారి నిన్న మంగళవారం ది. జూన్ 17 న షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం పూర్తి డ్రాఫ్ట్ ని అమరావతిలో సిఎంఓ కార్యాలయంలో అందిచడం జరిగింది. షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం విషయంలో ప్రభుత్వం సానుకూల స్పందిస్తున్నందున తాత్కాలికంగా రిలే నిరాహార ధీక్షలు విరామిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ప్రకటించింది. జల్లి నరేష్ ఆధ్వర్యలో చింతూరులో జరుగుతున్న రిలే దీక్షలకు కూటమి ప్రభుత్వం తరుపున బీజేపీ ఎ ఎస్ ఆర్ జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య దీక్ష శిబిరానికి విచ్చేసి కార్యకర్తలకు నిమ్మరసం తాగించి దీక్షలను విరమింపజేశారు అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున ఈ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెరవేరేలా కృషిచేసే బాధ్యత ఆదివాసి బిడ్డగా నాపై ఉందని త్వరలోనే లోకేష్ గారిని కలిసి ఈ విషయంలో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా జేఏసీ సెంట్రల్ కమిటీ సభ్యులు మడివి నెహ్రూ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపుతో తలపెట్టిన గత 34 రోజులుగా కొనసాగుతున్న చింతూరు డివిజన్ రిలే నిరాహార దీక్షలను రాష్ట్ర కమిటీ ఆదేశాలతో బుధవారం మధ్యాహ్నం నుండి చింతూరు ఐ టి డి ఏ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలను 35 వ రోజు విరమించడం జరిగింది. ఈ విరామం రిలే నిరాహార దీక్షల కే కానీ, షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం సాధన ఉద్యమానికి కాదని తెలియశారు. ఉద్యమ పందా మార్చుకొని చట్టం సాధించుకునేంతవరకు, మెగాడీ ఏసీలోని ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతో భక్తి అయ్యేంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తూ మలిదశ ఉద్యమానికి సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ నిర్వాహక బాద్యులకు, గ్రామాలనుండి తరలివొచ్చి మరీ దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొన్న యువతకి నిరుద్యోగులకి ఆదివాసి ప్రజానీకానికి గ్రామ పెద్దలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు, సంపూర్ణ మద్దతునిస్తూ అండదండగా నిలిచిన ఆదివాసి ప్రజాసంఘాలకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు, యువజన, నిరుద్యోగ, మహిళా సంఘాలకు, మద్దతునిచ్చిన ప్రజా, పౌర సంఘాలకు రాజకీయ పక్షాలకు, సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులకు అధికారులకు శాంతిభద్రతలను పర్యవేక్షించిన పోలీసులకు ఆదివాసి జెఎసి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మలిదశ ఉద్యమానికి ఇదే అంకిత భావంతో సిద్ధంకావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎపిఎజెఎసి రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్, ఎటపాకా మండల చైర్మన్ కుంజా శ్రీను, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల ప్రచార కార్యదర్శి పోడియం లక్ష్మణ్, చట్టి పెస కార్యదర్శి పోడియం రామకృష్ణ, నాయకుడు సేవా సంఘం నుండి సిక్కాల బాలు, కారం సంకురక్క, కారం సాయి,మడివి రాజు, మడివి సాయి, కారం చందు, మడివి మహేంద్ర, తుర్రం నీల్ రాజు చట్టి యూత్, నాయకపోడు సేవాసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.