
బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,లక్ష్మా రెడ్డి మరియు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి,రాంమోహన్ రెడ్డి,
(పయనించే సూర్యుడు ఏప్రిల్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ గురు లోకమసంద్ మహారాజ్ బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న జాతరకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు,మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,లక్ష్మా రెడ్డి మరియు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి,రాంమోహన్ రెడ్డి,పూజాకార్యక్రమాల అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నాని పలు అంశాల పై మాట్లాడారు.బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
