పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 13//మక్తల్
మాద్వర్ గ్రామంలో నేడు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా మక్తల్ మండలంలోని మాధ్వార్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రాములు.ఆధ్వర్యంలో పాఠశాల పునఃప్రారంభం విద్యార్థులు అడ్మిషన్లతో సందడి వాతావరణం మొదలైంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందన్నారు., కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడి బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక మౌలిక వసతులతో మెరుగుపరచడంతో ఎన్నడు లేని విధంగా సర్కార్ బడిలో విద్యార్థుల చేరికలు పేరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతోపాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు సర్కార్ బడి, ఉపాధ్యాయుల పై పెట్టుకున్న నమ్మకానికి పాఠశాల బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు సాధించే దిశగా నూతన విద్యా ప్రమాణాలతో విద్యను అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు. వెంకట్ రాములు. తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు. రామాంజనేయులు. రవీందర్ రెడ్డి. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్థులు పాల్గొన్నారు.