గట్టిఅడుగు"*మత్తు పదార్థాలపై సమాచారం కోసం 100 కు కాల్ చేయండి – పోలీసులు*
పయనించే సూర్యుడు జూన్ 14 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో పోలీసులు భారీగా కాటన్ సెర్చ్ నిర్వహించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. సాలూర ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ డ్రైవ్ లో మొత్తం 70 వాహనాలు సీజ్ చేసినట్టు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.ఈ తనిఖీల్లో బోధన్ నియోజకవర్గం పరిధిలోని బోధన్ టౌన్, బోధన్ రూరల్, ఎడపల్లి, రుద్రూరు, వర్ని ఎస్ఐలు పాల్గొన్నారు. ముఖ్యంగా బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, బోధన్ టౌన్ ఎస్ఐ భాస్కర్ చారి, రూరల్ ఎస్ఐ మచందర్ రెడ్డి ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ రెడ్డి వర్ని ఎస్ఐ మహేష్ రుద్రూర్ ఎస్సై సాయన్న రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తనిఖీల్లో పాల్గొన్నారు.తనిఖీల్లో ప్రతి వాహనాన్ని పాఠశాల ప్రాంగణానికి తీసుకువచ్చి, నిబంధనలు అతిక్రమించిన వారికి ఫైన్లు విధించారు. ఈ సందర్భంగా ఏసీపి శ్రీనివాస్ రావు మరియు సీఐ విజయబాబు మాట్లాడుతూ, "వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, హెల్మెట్ తప్పనిసరి. మత్తు పదార్థాలు, డ్రగ్స్ వంటి వాటిని వాడొద్దు. ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే 100 నంబరుకు తెలియజేయండి" అని సూచించారు. మహిళల భద్రత దృష్ట్యా 'షీ టీమ్' ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమాజాన్ని డ్రగ్స్ రహితంగా, ట్రాఫిక్ సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని మరియు గర్భిణీ స్త్రీలను మత్తు పదార్థాలు లాంటివి ఇవ్వకూడదని పిల్లలు తెల్లగా పుడతారని గర్భిణులకు ఎలాంటి ప్రమాదం ఉండదని మూడ నమ్మకాలతో కళ్ళు లాంటి మత్తుపదార్థాలు ఇస్తున్నారు ఇలాంటివి తెలియజేయడం కోసమే మీ ముందుకు వచ్చామని బ్రష్టు పట్టిన ఈ మత్తు పదార్థాలకు మీ దృష్టిలో నుంచి తీసివేయాలని యువత ఇప్పటికైనా మేలుకొని ఇలాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దని పోలీసు అధికారులు తెలిపారు. సాలుర గ్రామానికి విచ్చేసి ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి పోలీసు బృందానికి ఇల్త్ పు శంకర్ సార్ మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ టౌన్ మరియు మండల ఎస్సైలు ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు