
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఏపీ సివిల్ సప్లైస్ బోర్డు డైరెక్టర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిధిలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోదాములను అధికారికంగా సందర్శించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్( పిడిఎస్) కింద పంపిణీ అయ్యే నిత్యావసర సరుకుల నిల్వ మరియు పంపిణీ విధానాన్ని సమీక్షించారు.తనిఖీ సందర్భంగా డైరెక్టర్ స్టాక్ రిజిస్టర్లు, బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకుల నాణ్యత, తూకం యంత్రాలు, పారిశుద్ధ్య పరిస్థితులు, నిల్వ విధానం, భద్రతా చర్యలను పరిశీలించారు. ధాన్యాలు తడవకుండా, పాడవకుండా సరైన నిల్వ ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఎలాంటి కొరత లేకుండా అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంటూ పంపిణీ లేదా రికార్డుల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.స్టాక్ నిర్వహణలో పారదర్శకత పాటించి ఫెయిర్ ప్రైస్ షాపులకు సమయానికి సరఫరా చేయాలని ఆదేశించారు. పురుగు నివారణ, గాలి ప్రసరణ, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు, గోదాముల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.తనిఖీలో సివిల్ సప్లైస్ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని శాఖ మార్గదర్శకాలను వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీ నిర్వహించబడింది అని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం బిజెపి టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ , గోనమడతల రవికుమార్ , రామనాథ్ గుప్త, కాకినాడ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కాళ్ళ ధనరాజు మరియు బి జే పి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
