పయనించే సూర్యుడు;జూన్ 09: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు; ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెద్ద గొల్లగూడెం మరియు ఇప్పగూడెం గ్రామాల్లో సోమవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో
భాగంగ వైద్యాధికారి తరుణ్ఆధ్వర్యంలో ఇంటి మలేరియా సర్వేలో భాగంగా కాన్పునకు దగ్గర ఉన్న గర్భవతిని పరీక్షించడం జరిగిందనీ, అంతేకాకుండా వైద్య శిబిరం కూడా నిర్వహించడం జరిగిందనీ డాక్టర్ తరుణ్ తెలిపారు.గ్రామస్తులకు వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని కరపత్రాలు పంపిణీ చేసి వారికి సీజన్ వ్యాధుల గురించి తెలియపరచడం జరిగిందని తెలియజేశారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ,నీరుని కాచి చల్లార్చితాగాలని మీ ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు డబ్బాలపై మూతలు పెట్టాలని నిలవ నీరు పారబోయాలని గ్రామస్తులకు సూచించారు. ఈయొక్క కార్యక్రమంలో వైద్యాధికారి తరుణ్,హెల్త్ సూపర్వైజర్స్ వెంకటరమణ,కోటిరెడ్డి, ఏఎన్ఎంలలిత కుమారి మరియు ఆశ కార్యకర్తలు మాలతి,శివకుమారి గ్రామస్తులు పాల్గొన్నారు.