పయనించే సూర్యుడు: జూన్25: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బుధవారం పెద్ద గంగారం గ్రామంలో డాక్టర్ రాహిల్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగినది.ఈయొక్క కార్యక్రమంలో భాగంగా 30 మందికి వైద్య పరీక్షలు చేసి చికిత్స చేయడం జరిగిందనీ తెలిపారు. అదేవిధంగా ముగ్గురు గర్భవతులకు పరీక్షలు చేసి, పౌష్టికాహారం తీసుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ప్రసవం కావాలని తెలియజేశారు.వర్షాలు పడుతున్నందున నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని,నిల్వ ఉన్న నీటిని పారవేయాలని,నిత్యవసరాలకు ఉపయోగించే నీటి నిలువ పాత్రలు ఎప్పటికప్పుడు మూతలు పెట్టాలని ప్రతి మూడు రోజులకు ఒకసారి పాతనీరు తీసివేసి కొత్తనీరు పట్టుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా
దోమల పుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దోమలు కుట్టకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని దోమతెరలు వాడాలని తెలియజేశారు.
తడి తేమ వాతావరణం మన పరిసరాలలో ఉన్న, మన శరీరాలలో ఉన్న సూక్ష్మ జీవులను ఆకర్షించి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేశారు.
కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగవాలని,వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని,ఈగలు వాలని ఆహారం తినాలని,ఇంటి పరిసరాల్లో ఈగలు లేకుండా చూసుకోవాలనితెలియజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఇఓ. వేణుగోపాలకృష్ణ, హెచ్ఏ. తిరుపతి ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.