పమనించే సూర్యుడు అక్టోబర్ 4 సూళ్లూరూపేట మ0డలరి పోర్టర్ దాసు) సూళ్లూరుపేట పురపాలక సంఘం కమిషనర్ కె.చిన్నయ్య ఆదేశాలు మేరకు సూళ్లూరుపేట పురపాలక నందు ఈరోజు అనగా 04.10.2025 న శనివారం మధ్యాహ్నం 4 గంటలకు జీఎస్టీ 2.0 మరియు వాటి తగింపు ఫలాలను పొదుపు సంఘాలు ద్వారా మరియు మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి ఇంటికి తెలియపరచి జీఎస్టీ 2.0 కరపత్రాలు మరియు బ్రోచర్లు అందచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో షాపు యజమానులకు కొత్తగా అమలు చేసిన జీఎస్టీ కి వస్తువులు అందించాలని మరియు ప్రజలకు కూడా జీఎస్టీ తగింపు కూడా తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ఆఫీసర్ భాస్కర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.రమేష్ గారు, మున్సిపల్ సిబ్బంది మరియు మెప్మ సిబ్బంది పాల్గొనడం జరిగినది.