
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 5మక్తల్ }
జక్లేర్ ఉపమండల హిందూ సమ్మేళన కమిటీ కోశాధికారి రాఘవేందర్ గౌడ్. హిందూ సమాజాన్ని చైతన్యపరిచి భారత్ ను విశ్వగురు స్థానంలో నిలుపాలని ఉద్దేశంతో జక్లేర్ లో ఏప్రిల్ 5న జరుపబోయే హిందూ మహాసమ్మేళనాన్ని జక్లేర్ ఉప మండలంలోని గుడిగండ్ల, జవలాపూర్ మాధన్ పల్లి, సామాన్ పల్లి, రామసముద్రం, జక్లేర్, మంతన్ గౌడ్, గొల్లపల్లి, టేకులపల్లి,కాచివార్, నర్సిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ కోశాధికారి రాఘవేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన కమిటీ నాయకులు నర్సిరెడ్డి గారు, కావలి వెంకటేష్, రాజశేఖర్ రెడ్డి,శ్రీనివాస్,విష్ణు,వీరేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు