లవని ప్రియకు ప్రముఖ పీఠాధిపతి ఆశీర్వాదం..
పయనించే సూర్యడు // మార్చ్ // 22 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ సీనియర్ పాత్రికేయులు నిమ్మటూరి సాయి కృష్ణ కుమార్తె, లవని ప్రియ మరోసారి తన నృత్య నైపుణ్యంతో గర్వించదగిన గుర్తింపు పొందింది. ఇటీవల బాసర సరస్వతి కళ్యాణ మండపంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో అద్వితీయంగా అలరించిన ఆమెను, ప్రముఖ పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ మాధవ నంద సరస్వతీ స్వామి వారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ప్రతిభకు తగిన ప్రోత్సాహంగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న లవని ప్రియ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని స్వామిజీ ఆశీర్వదించారు. ఆమె కృషికి కుటుంబ సభ్యులు, గురువులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. నృత్య ప్రపంచంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషిస్తున్న లవని ప్రియ, తన సాధనను కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని పలుగురు కోరారు.