మేడే స్ఫూర్తితో పని గంటల పెంపుకి వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్ లరద్దుకై, లివింగ్ వేతనంకై, పోరాడుదాం
జరుపుల సుందర్ టేకులపల్లి ఏరియా కార్యదర్శి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి139 వ మేడే ను జయప్రదం చేయాలని, మేడే స్ఫూర్తితో పని గంటల పెంపుకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై, లివింగ్ వేతనంకై, పోరాడాలని టి యు సి ఐ టేకులపల్లి ఏరియా కార్యదర్శి జరుపల సుందర్ పాయం వెంకన్న, మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈరోజు టేకులపల్లి లోని సింగరేణి హైటెక్ కాలనీలో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందు తరాల కార్మిక వర్గం పోరాడి, రక్త తర్పణ చేసి 8 గంటల పని దినం, హక్కులు సౌకర్యాలు సాధిస్తే నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి, ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నదని దానిలో భాగంగానే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని అన్నారు. ఇలాంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలంటే బలమైన కార్మిక, ప్రజా పోరాటాలే మార్గం అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలోమోటర్ వర్కర్స్ యూనియన్ టేకులపల్లి ఇప్పుడు మంచి కార్యదర్శి గూగులోత్ మదార్, ఏరియా నాయకులు ఏనుటి నాగన్న షేక్ షఫీ ప్రసాద్ ఎర్రమ్మ బాబు కౌసల్య ఇంకా తదితర కార్మికులు పాల్గొన్నారు.