
ఎన్నికైన ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు బిజెపి మద్దతు దారులే*
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పంతం నెగ్గించుకున్నారు. మొదట్లో జరిగిన మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల్లో బిజెపి కౌన్సిలర్ ను తప్పు దోవ పట్టించడంతో అప్పట్లో ఎన్నిక రసబాసాగా మారి ఎన్నిక వాయిదా పడగా, మంగళవారం జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో మూడు స్థానాలకు ఎన్నికలు జరగగా మూడు కోఆప్షన్ పదవులు మున్సిపల్ చైర్మన్ మద్దతు దారులు దక్కించుకున్నారు. దీంతో నాలుగు కోఆప్షన్స్ స్థానాల్లో మూడు బిజెపి మద్దతు దారులు కైవసం చేసుకున్నారు. ఎన్నిక ప్రారంభం కావడంతో ఆరుగురు బిజెపి కౌన్సిలర్లు, ఏడుగురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎంఐఎం కౌన్సిలర్లు గైరాజరవడంతో కోఆప్షన్ ఎన్నిక ఏకపక్షం అయింది. అనుకున్న స్థానాలు లేకపోయినప్పటికీ ఎంఐఎం పార్టీ కో ఆప్షన్ మెంబర్ల ను ద క్కించుకోవడానికి ఎత్తులు వేయడం, పలు ఆరోపణలు చేసినప్పటికీ ఎమ్మెల్యే పటేల్ ముందు ఎలాంటి పాచికలు పారలేదు. మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి నేత్రుత్వం లో కౌన్సిలర్ లు హైకోర్ట్ కు వెళ్లగా ఎన్నిక జరిగింది... *ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక* మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గా తోట లింగురాం, ముజీబ్ అహ్మద్, అల్లకొండ కవిత ఎన్నికయ్యారు. ఇందులో ఇద్దరు తోట లింగురాం, ముజీబ్ హైమద్ లు గతం లో మున్సిపల్ వైస్ చైర్మన్ లు గా పదవులు చేపట్టిన వారే.. అల్లకొండ కవిత గతం లో కౌన్సిలర్ గా పనిచేశారు.. వీరికి నియామక పత్రాలను సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కమి షనర్ లింగయ్య నియామక పత్రాలను అందజేశారు... *మున్సిపల్ కార్యాలయం ముందు మిన్నంటిన సంబరాలు* కో ఆప్షన్ ఎన్నికల్లో బిజెపి మద్దతు దారులు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడంతో మున్సిపల్ కార్యాలయం ముందు సంబరాలు మిన్నంటాయి. బిజెపి నాయకులు కార్యకర్తలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అభిమానులు, టపాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.. అనవసరపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు* *జాబీర్ హైమద్ ను హెచ్చరించిన మున్సిపల్ చైర్మన్* తమ నేత ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ హైమద్ ను హెచ్చరించారు. కో ఆప్షన్ ఎన్నిక ముగిసిన అనంతరం అయన మీడియా తో మాట్లాడారు. మరో మారు ఇలాంటి ఆరోపణలు చేస్తే తగిన రీతిలో సమాధానం చెబుతామన్నారు. గతం లో తప్పు దోవ పట్టించి ఎం. ఐ. ఎం. పార్టీ ఒక కో ఆప్షన్ స్థానాన్ని దక్కించుకున్న విషయం లో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.