
పయ నించే సూర్యుడు మే 23 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం వాస్తవ్యుడు భారతీయ జనతా యువమోర్చా గోదావరి జోన్ ఇన్చార్జ్ (కాకినాడ, తూర్పుగోదావరి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణాజిల్లాలు) కొండేటి ఈశ్వర్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినందున అతనిని మరియు కుటుంబ సభ్యులను రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పరామర్శించారు.అధైర్య పడవద్దని తమకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఆయన వెంట ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, గుంటూరు జిల్లా ఇంచార్జ్ తమలంపూడి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాశిన ఫణీంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,గణాల సాయి, తదితరులు పాల్గొన్నారు.