
* పోస్టర్ని ఆవిష్కరించిన పివిఎన్ మాధవ్
పయనించే సూర్యుడు జూన్ 6 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారి అధ్యక్షతన గీత కులాల పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అతిథులుగా పాల్గొని *సంకల్పం తాటి చెట్టు కల్పవృక్షం* అనే పోస్టర్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో నలుమూలల నుంచి అనేకమంది శెట్టిబలిజ గౌడ శ్రీసయన యాత ఈడిగ గీత కులాల పెద్దలు పాల్గొన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ గాంధీ గారు మొట్టమొదటిగా ప్రారంభించింది ఉప్పు సత్యాగ్రహం కాదని నీరా ఉద్యమమని తెలియజేశారు తాటి చెట్లు ఈ సంస్కృతి లో భాగమని తాటి చెట్టు నుంచి వచ్చే ప్రతి ఫలముగాని పానీయముగాని ఔషధంతో సమానమని అలాంటి తాటి చెట్లను, కళ్ళుగీత కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని అందుకే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో *10 లక్షల చెట్లను* నాటనుందని తాటి చెట్టు ని రాష్ట్ర చెట్టుగా ఏర్పాటు కోసం మాట్లాడుతామని తెలియజేశారు రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు మాట్లాడుతూ గీతకులాలు ఒక ఐక్యతగా కలిసి ఉండేవని రాజకీయ చదరంగంలో గీతకులాలు పావులుగా మారి ముక్కలయ్యాయని భారతదేశంలో గీతకులాలు అనేక పేర్లతో ప్రతి ప్రాంతంలోని మెజారిటీ సభ్యులుగా ఉన్నారని తెలియజేశారు బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ బిజెపి బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించి ఉపకలాలతో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలపై చర్చిస్తుంది అని దానిలో భాగంగా ఈరోజు గీత కులాలకు సంబంధించి పెద్దలతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమం లో బిజెపి అమలాపురం కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ గారు మాట్లాడుతూ నీరా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడితే అది ఒక ఆర్థిక వనరుగా తయారుచేయవచ్చని దానివల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఎప్పుడైతే ఉపాధి మార్గంగా ఏర్పడిందో ఆ రంగాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తారని తెలియజేశారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన గీతకులాల పెద్దలు సమావేశంకి కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కోసం వారికి కావలసిన సదుపాయాల కోసం, కల్లుగీత కార్మికులు భీమా సదుపాయం గాని పెన్షన్ సదుపాయాలు గాని అందు కోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం కూడా వారికి ఎటువంటి పనిముట్లు అందించట్లేదని తెలియజేశారు గీత కార్మికులకి ప్రభుత్వం గతంలో వారికి కావలసిన సామాగ్రి అందించేవారని ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి సదుపాయాలు అందట్లేదని దాని వల్ల వారికి జీవనోపాధి ఇబ్బంది అవుతుందని, గీత కార్మికుడు ఒక చెట్టు మీద నుంచి పడిపోయి ప్రమాదంతో భీమా చాలా ముఖ్యమని ప్రభుత్వాల వాటి పై చర్యలు తీసుకోవాలని, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో నీరా ప్రాజెక్టు ద్వారా గీత కార్మికులకు యువకులకు ఉపాధి లభిస్తుందని ఎన్నికల ముందు కూటమి పార్టీ లు కూడా అనేక కళ్ళు గీత కార్మికులకి అనేక హామీలు ఇచ్చయని ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మా కల్లుగీత కార్మికుల కష్టాలని తెలుసుకుంటున్న బిజెపి పార్టీ నాయకులు ఆ హామీలను నెరవేర్చే చర్యలను చేపట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గీతకు కులాల పెద్దలు తెలియజేసిన అనేక సమస్యలను విని పివిఎన్ మాధవ్ గారు వీటన్నిటిమీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుండి సాధించే దిశగా అడుగులు వేస్తుందని మళ్లీ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకొని ముందుకు వెళ్దామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాల నుంచి శెట్టిబలిజ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయినవిల్లి సత్తిబాబు గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వుడవల్లి రాంబాబు, బుర్ర ఆంజినేయులు, సూరంపూడి సత్యనారాయణ, దొడ్డి వీరేంద్ర, గీసాల శ్రీనివాస్, చొల్లంగి వెంకటరమణ , ఇళ్ళ సత్య నారాయణ, బొక్క సత్యనారాయణ, మేడిశెట్టి మధుసూదన్ రావు, ఇళ్ళ వెంకటరమణ, దొడ్డి అప్పలరాజు, నైనపు శివ, వనచర్ల కిరణ్ మరియు గౌడ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు