
పయనించే సూర్యుడు 8 6 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటరు జాబితా సర్వేనెంబర్ ప్రతి బూత్ పరిధిలో నిర్వహించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని తమ ఆధీనంలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ సర్వే కొనసాగుతుందని దానిని అడ్డుకోవడానికి మనకు అనుకూలమైన ఓటర్లు పోకుండా చూసుకోవడానికి మన పార్టీ తరఫున ప్రతి బూత్ కు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించడం జరిగిందని, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడానికి శిక్షకులను నియమించారని, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి కొనగల మహేష్ నియమించడం జరిగిందని అన్నారు. ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు అమ్మ వెంచర్ లోని ఎస్ ఆర్ కే ఫంక్షన్ హాల్ నందు నిజామాబాద్ అర్బన్ బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మధ్యాహ్నం భోజనం అక్కడే ఏర్పాటు చేయడం జరిగిందని కావున ప్రతి ఒక్క యూత్ లెవెల్ ఏజెంట్ తప్పనిసరిగా రావాలని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. సర్వే పేరుతో ఓటర్లను తొలగిస్తే అది రాబోయే ఎన్నికల్లో మనకి నష్టం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు శిక్షణ శిబిరానికి వచ్చి అక్కడ పెద్దలు సూచించే సలహాలు సూచనలు విని సర్వేను పెట్టి లోపాలు జరగకుండా నిగాపెట్టే విధంగా ఉపయోగపడుతుందని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి నిజామాబాద్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు అంతా రెడ్డి విజయ పాల్ రెడ్డి సయ్యద్ సలీం కోశాధికారి సకినాల శివప్రసాద్,అధికార ప్రతినిధి మహమ్మద్ జియా,కో ఆప్షన్ మెంబర్ నరేంద్ర సింగ్, డిసిసి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు జిల్లెల రమేష్,బాత్నతే శంకర్, అవిన్ ధర్మారం, అర్షద్ పాషా,కార్యదర్శులు రాజు,స్వప్న, మీనా శర్మ సంతోష్, రాజు, ప్రవీణ్,సంతోష్, ఎక్జిక్యూటివ్ సభ్యులు సన్నీ గౌడ్, బసవ సాయి, రాజ్ గగన్,ఇమ్రాన్ ఖాన్ మరియు తదితరులు పాల్గొన్నారు