
( పయనించే సూర్యుడు జూలై 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీలలో నెలకొన్న సమస్యలతో పాటు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న విద్యాసంస్థల బందు పిలుపు నిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం.పవన్ చౌహాన్,ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ పాల్గొని మాట్లాడారు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.బకాయి ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, ఆర్టీసీ లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు సుమేర్ కార్యదర్శి,శివశంకర్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు కార్తీక్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.