ఉచిత కోచింగ్ కరపత్రాలను విడుదల చేసిన ప్రిన్సిపల్..
పయనించే సూర్యుడు బాపట్ల జూన్ 8:- రిపోర్టర్ (కే శివకృష్ణ) AP హైకోర్టు &జిల్లా కోర్టు 1620 జాబ్స్ కు ఉచిత శిక్షణ కరపత్రాలు విడుదల చేసిన బాపట్ల శ్రీ భావపురి కోచింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ ఆవల వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా కోర్టు లలో 10 కేటగిరీ లో 1620 ఉద్యోగాలకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.రాబోవు మూడు నెలల్లో ఈ ఉద్యోగాలకు ఎంపిక కు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు..దరఖాస్తు చేసుకున్న కోర్టు జాబ్స్ ఉద్యోగాలకు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈనెల 9,10,11 తేదీలు సోమ, మంగళ, బుధ వారము లు మూడు రోజులు ఉదయం 9-00 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బాపట్ల శ్రీ భావపురి కోచింగ్ సెంటర్ నందు ఉచిత శిక్షణ ను విజయవాడ "ఫోకస్ ఫార్టి శిక్షణాసంస్థ మరియు హైదరాబాద్ లలో పేరొందిన శిక్షణా సంస్థల సీనియర్ ఫ్యాకల్టీ లచే జీకే,కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్,అర్థమెటిక్ మరియు జనరల్ స్టడీస్ అంశాల పై ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపే కరపత్రాలను విడుదల చేసి నిరుద్యోగ అభ్యర్థులంతా ఈ ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 9848791935 నెంబర్ కు కాల్ చేయవచ్చని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా డీఎస్సీ పరీక్ష కు హాజరగు అభ్యర్థులకు ఉద్యోగం పొందడానికి అనేక సలహాలను సూచనలను తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గురజాల శ్రీనివాసరావు గారు అందించి శుభాకాంక్షలు తెలిపారు…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సంతకం తో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 16347 టీచర్ ఉద్యోగాలకు అవకాశం కల్పించి నందులకు ధన్యవాదాలు తెలుపుచూ, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ ఆఫ్ మైనారిటీస్ CEDM మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా గత 45 రోజులు గా డీఎస్సీ ఉచిత శిక్షణ పొంది రాతపరీక్ష కు హాజరు కానున్న మైనారిటీ & నాన్ మైనారిటీ అభ్యర్థులకు వీడ్కోలు పలుకుతూ సీనియర్ ఫ్యాకల్టీ శ్రీ కె వి ఆర్ జి శర్మ,, శ్రీ హరి సార్ లు శుభాకాంక్షలు అందించారు… శిక్షణ పొందిన
అభ్యర్థులు సీనియర్ ఫ్యాకల్టీ సార్ లను సన్మానించారు.. ఇంకా ఈ కార్యక్రమంలో విజయవాడ ""ఫోకస్ ఫార్టి ""Focus forty " శిక్షణా సంస్థ డైరెక్టర్ కె కె..,MD నాగలక్ష్మి మేడం విద్యార్థులు పాల్గొన్నారు…