
పయనించే సూర్యుడు న్యూస్ :ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధి మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్లో మరో నలుగురు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. నిన్న జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మృతి చెందారు.