
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల పరిధిలోని కోన రామలింగేశ్వర స్వామి సన్నిధిన సోమవారం 1996-97 విద్యా సంవత్సరంలో యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాస సోమవారం సందర్భంగా కోన క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ నాగేష్, విజయ్ కుమార్, కాశీం ఎలక్ట్రానిక్ మహమ్మద్, శేఖర్ రెడ్డి, రామాంజి, అంజి, మురళి, వెంకటేష్, గిరి, చంద్రశేఖర్ రెడ్డి, తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

