
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడీకీ మండలముతోపాటు తాడిపత్రినీయోజకర్గములోని అన్నిమండలాలనుకరువుమండలాలుగా ప్రకటించాలి సోమవారం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడు యాదవ్, సి.పి.ఐ. నాయకులు, రైతు సంఘం నాయకులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా వెంకటరాముడు యాదవ్ మాట్లాడుతూ యాడికి మండలముతో పాటుతాడిపత్రినీయోజకవర్గములోని అన్నిమండలాలలో రైతన్నలు పత్తి,వేరుశనగ, తదితరపంటలుసాగుచేసి జూన్,జూలై నెలలో సకాలంలో వర్షాలు లేక పంటపెట్టుబడికూడరాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరువుమండలాలజాబితాలో తాడిపత్రి నీయోజకవర్గాన్నికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలువిస్మరించాయి రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయిపాలకులు అధికారంలోకి రాకముందు రైతే రాజు రైతు లేనిదే రాజ్యము లేదు అనిగోప్ప,గోప్పమాటలు చెప్పడం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి అందువలన రైతులు ప్రతియేటా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల వైపు మల్లుతున్నారు ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతున్నది, కావునపత్తికీగిట్టుబాటుధర క్వింటా 12వేల రూపాయలు రైతుకు నష్ట పరిహారం అందించాలి, వేరుశనగ,తదితర పంటలురైతుసేవాకేంద్రాలద్వారాగిట్టుబాటుధరతోకోనుగోలుచేయాలి,అరటిధర రెండువేలుకుపడిపోయిరైతులభాధలుఅంతాఇంతాకాదుకావునఅరటిరైతులకుగిట్టుబాటుధరఇచ్చిఅధుకోవాలిఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుతాడిపత్రినీయోజకవర్గములోనిఅన్నిమండలాలనుకరువుమండలాలుప్రకటించిరైతాంగ సమస్యల పైన పూర్తిగా దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ రైతుకు 20 వేల రూపాయలు అన్నదాతసుఖీభవ వెంటనే అందించాలని, పంటలు నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారం అందించి,నకిలీ విత్తనాలు, ఎరువులు, అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టేలా చట్టాలు రూపొందించాలని ఏపీ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ ప్రతాపరెడ్డి కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘం సీనియర్ నాయకులు ఓబిరెడ్డి, సి.పి.ఐ.మండల సహాయ కార్యదర్శి వడ్డె రాముడు, చేనేత మండల కార్యదర్శి బండారు రాఘవ, సి.పి.ఐ.సీనియర్ నాయకులు నబి రసూల్, గరిడి శివన్న, పట్టణ కార్యదర్శి కుళాయి రెడ్డి వెంకటరమణ ,ఆదిరంగారెడ్డి రామప్ప, మారుతి ప్రసాద్, వెంకట నాయుడు పాల్గొన్నారు.
