
పయనించే సూర్యుడు నవంబర్ 11 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా నారాయణవనం మండలం –మండల రిపోర్టర్ గా ప్రజా టీవీకి నూతనంగా నియమితులైన జర్నలిస్టు మొట్టికాయల కిషోర్ను స్థానిక ప్రభుత్వ అధికారులు అందరినీ కలిసి ఆత్మీయంగా అభినందించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రోజా రాణినీ (MRO), వైద్య శాఖ మెడికల్ సూపరింటెండెంట్ నాగ సుధా, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు, అలాగే MPDO అరుణ కలిసి
వారంతా కిషోర్కు అభినందనలు తెలుపుతూ, ప్రజా సమస్యలను నిజాయితీగా వెలుగులోకి తెచ్చి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ప్రజా టీవీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి బూరగా సిద్దయ్య మరియు R5tv జోనల్ హెడ్ కె రాఘవ, R5 టీవీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి మురళి కృష్ణ పాల్గొన్నారు.