
పయనించే సూర్యుడు న్యూస్ :వరంగల్ కార్పొరేషన్ పరిధిలో రఘు అనే పారిశుధ్య కార్మికుడు రాంపూర్ – మడికొండ మధ్య పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నాడు.. వర్షాలు, వరదల వల్ల సంభవించిన బురద, వ్యర్ధాలను క్లీన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారు గాజులు దొరికాయి. వాటి విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుంది. 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు గాజులు నడిరోడ్డుపై చెత్తలో దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. పండుగ చేసుకుంటారు.. కానీ వరంగల్ కు చెందిన ఆ మున్సిపల్ కార్మికుడు బంగారు గాజులు దొరికిన వెంటనే ఎగిరి గంతెయలేదు.. తన నిజాయితీని చాటుకుని వెంటనే ఆ గాజులను తీసుకెళ్లి తన పై అధికారులకు చూపించాడు.. అక్కడి నుంచి ఆ గాజులను తీసుకెళ్లి GWMC కమిషనర్ చాహత్ బాయ్ పాయ్ కి సమాచారం అందించాడు.. కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆ గాజులను అప్పజెప్పారు. వర్షాలు వరదల సమయంలో ఎవరైనా బంగారు గాజులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే.. ఆ గాజుల తాలూకు బిల్లు, సరైన వెయిట్ ఆధారాలతో వస్తే తిరిగి ఆ గాజులు అప్పగిస్తామని మున్సిపల్ కమిషనర్, పోలీస్ సిబ్బంది తెలిపారు.. సుమారు 6 లక్షల రూపాయల విలువగల బంగారు గాజులను నిజాయితీగా అప్పజెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు రఘును ప్రతీ ఒక్కరూ అభినందించారు.. ఆ బంగారు గాజుల వెనుక బాధితుల ఎంతోకష్టం దాగి ఉంటుందని అలా ఉచితంగా దొరికినది ఏది ఉంచుకోవద్దని రాజు తన నిజాయితీని ప్రదర్శించాడు.. చెత్త శుభ్రం చేసేవాడైనా ఎంతో చిత్తశుద్ధి ఉన్న వ్యక్తని అంతా అభినందించారు.. పోలీసులు, మున్సిపల్ కమిషనర్ తో సహా నగర ప్రజలు ప్రశంసించారు.