
పయనించే సూర్యుడు నవంబర్ 16 నిర్మల్ జిల్లా బ్యూరో తెలివెలుగుల చక్రపాణి.
రైతులకు మద్దతు కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శనివారం బైంసా మండలంలోని బిజ్జుర్, కోతుల్గాం, వానల్ పాడ్, పెండ్పెల్లి, తిమ్మాపూర్, గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా అయన మాట్లాడారు.రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్ళను వెనువెంటనే చేపట్టాలని నిర్వాహకులను ఆదేశించారు.రైతులకు రవాణా పరంగా ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో నియోజకవర్గం లో దాదాపు వంద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు తమ పంటను దళారులకు అమ్మవద్దన్నారు. మహిళ సంఘాల సభ్యులు ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యం తో కేంద్రాల నిర్వహణ బాధ్యత మహిళ సంఘ సభ్యులకు అప్పజేప్పడం జరిగిందని అన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా మొదట పంటను అమ్ముతున్న రైతును ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను ఆయా గ్రామాల ప్రజలు స్వాగతించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో నీరజ్, ఎంపీవో జాదవ్ ప్రదీప్, సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు, బైంసా మండల బిజెపి అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, వైస్ ఎం పి పి గంగాధర్,ఆయా గ్రామాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
