
పయనించే సూర్యుడు, నవంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
మండపల్లిలోని సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో స్వయం పరిపాల దినోత్సవం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ–విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రల్లో వ్యవహరిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పాత్రను శివకుమార్, డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పాత్రను లహరి నిర్వహించారు. విద్యార్థులు చేపట్టిన బాధ్యతలు, చూపిన నియమనిష్ట మరియు క్రమశిక్షణ అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ కొక్కుల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ పూర్ణిమ, ఉపాధ్యాయినీ–ఉపాధ్యాయులు పాల్గొన్నారు.