
రుద్రూర్, నవంబర్ 7 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని బోయి సంఘంలో శుక్రవారం రోజున ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు, దంత వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ శిబిరంలో 126 మంది రోగులకు వైద్య సేవలను అందించారు. ఇందులో 32 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నందున ఉచిత కంటి ఆపరేషన్ నిమిత్తము బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే, లయన్ గాండ్ల మధు, మంజరి సీతారాం, మంజరి రాజు, బోయి సంగం అధ్యక్షులు సాయిలు, లక్ష్మణ్, ఉరడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
