
పయనించే సూర్యుడు గాంధారి 11/06/25
“ప్రభుత్వ కళాశాలల్లోనే చేరాలని ప్రచారం”.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని ఇంటింటికి వెళ్లి అధ్యాపకులు విద్యార్థులను కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ లు తీసుకోవాలని ప్రచారం నిర్వహించారు. సర్కారు కళాశాలల్లో చదివితే కలిగే ఉపయోగాలను విద్యార్ధుల తల్లి తండ్రుల కు వివరిస్తున్నారు. ఉచిత పుస్తకాల పంపిణీ, బస్సు సౌకర్యం, స్కాలర్ షిప్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ జాయిన్ కావాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకున్న విధ్యార్థులు ఎంసెట్ లో ఉచిత సీట్ల గురించి లెక్చరర్లు అర్థమయ్యే విధంగా వివరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గంగారాం తెలిపారు. ఈకార్యక్రమంలో లెక్చరర్లు రాజగోపాల్,లక్ష్మణ్, విజయ్ కుమార్,రమేష్, సరిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.