Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వాకిటి

అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వాకిటి

Listen to this article

:పయనించే సూర్యుడు: జూన్ 20: మక్తల్

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అయ్యప్ప ఆలయాన్ని, ఆ ఆలయ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గురువారం సందర్శించారు. సందర్భంగా కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మంత్రికి మేళ తాళాలు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments