Sunday, June 8, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసీ నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం

ఆదివాసీ నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఇంచార్జ్ మే 27.

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ముందు 13వ,రోజు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమానికి ఆదివాసి జేఏసీ కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ అధ్యక్షత వహించి రిలే నిరాహార దీక్షలకు హాజరైన వారికి పూలమాలవేసి స్వాగత ఉపాన్యాసంతో ప్రారంభించారు.ఈ రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు బుడమల మంగి రెడ్డి మాట్లాడుతూ…2025 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ టీచర్స్ పోస్టులు మినహాయించి,తక్షణమే నూరు శాతం స్థానిక ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేసేందుకు ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,తక్షణమే (టిఏసి)ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి సభ్యులుతో కమిటీతో తక్షణమే తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,జీవో నెంబర్ 3కు చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు తక్షణమే మంజూరు చేసి ఉపాధి కల్పించాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.అలాగే ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కారుకోడి గాంధీ మాట్లాడుతూ…ఆదివాసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భారత రాజ్యాంగంలోని ఐదవ,ఆరవ షెడ్యూల్డ్ లోని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పేరా -4 ప్రకారం (టి.ఎ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగ పట్టభద్రుల భవిష్యత్తును కాపాడాలని టి.ఏ.సి కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులకు మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ రిలే నిరాహార దీక్షలు కార్యక్రమంలో పల్లాల బాలు రెడ్డి,కోసు రామన్న దొర,కోసు ప్రసాద్ దొర,చోడి వెంకటేశ్వర్లు దొర,మడకం లచ్చన్న దొర,కత్తుల రత్న కుమారి,తుర్రం వెంకటేశ్వర్లు దొర,మడకం వీర వెంకట వరప్రసాద్ దొర,చవలం శుభకృష్ణ దొర,ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,కారం రామన్న దొర,పొడియం శ్రీను బాబు దొర,పండా పవన్ కుమార్ దొర,పొడియం పండు దొర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments