Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్కాల పరీక్షలనుతట్టుకోవాలంటేతాత్విక జ్ఞానంపెంపొందించుకోవాలిపీఠాధిపతి డాక్టర్ ఉమర్ఆలీషా..

కాల పరీక్షలనుతట్టుకోవాలంటేతాత్విక జ్ఞానంపెంపొందించుకోవాలిపీఠాధిపతి డాక్టర్ ఉమర్ఆలీషా..

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)సామాన్యుని మొదలుకొని తత్వ వేత్తల వరకూ కాలం అందరినీ పరీక్ష పెడుతుందని కాలానికిఎవరూఅతీతులుకారని కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించు కోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఆలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేసారు. పంచ భూతాత్మక శక్తి స్వరూపుడే మానవు డని తెలిపారు. మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలం అని, తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీ తంగా ప్రయాణించే జీవి ఏదీ ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యా త్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించు కోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందనిఅన్నారు.నిరంతర కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్విని యోగ పరుచుకోవాలని పేర్కొన్నారు.మానసిక తృప్తి మానవుడిని సంస్కార వంతుడిని చేస్తుందని వెల్ల డించారు. ప్రతి మానవుడు విలువైన జీవితకాలాన్నివృద్ధిపరచుకోవాలనిఈప్రయత్నంలో మనసును అల్ల కల్లోలం చేసేటువంటి అరిషడ్వర్గా లనుస్థాయిపరచు కోవాలని పిలు పునిచ్చారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మంచి, చెడులను విశ్లేషించు కునే శక్తిని ఇస్తుందని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురౌతూ అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్న మానవుడు జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవా లంటే సహనశక్తిని పెంపొందించు కోవాలని అన్నారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అలవరచు కోవడం ద్వారా సహనశక్తి వృద్ధిచెంది తాత్వికజ్ఞానంతెలియబడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన “నా మొక్క, నా శ్వాస” కార్యక్రమంలో ప్రతి సభ్యుడూ పాల్గొని తమ వంతుగా ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించా లని పిలుపు నిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని అన్నారు. మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడు తున్న పీఠం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు.సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసన సభ్యుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మాట్లాడుతూ  మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతిశక్తులను తొలగించుకున్న ప్పుడు తనలోని పరమాత్మను దర్శించు కోగలుగుతాడని తెలిపారు. సూఫీతత్వవేత్తలైన ఈ పీఠాధి పతులు జ్ఞాన మహా సభల ద్వారా బ్రహ్మ విద్యను నేర్పుతూ విశ్వ మానవ శ్రేయస్సు కొరకు పాటుపడు తున్నారని, కొనియాడారు. పీఠాధి పతి ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరి కొంత మందికి పంచాలని సూచించారు.పీఠాధిపతి సోదరుడు అహ్మద్ అలీషా మాట్లాడుతూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతుల యొక్క విశిష్టత, మాతృ మూర్తుల యొక్క త్యాగాలు, పీఠం సభ్యుల సేవలు సవివరంగా సభకు వివ రించారు. వందలాది సంవత్సరాలు గా, వేదాంత విద్యను కాలాను గుణ్యంగా సభ్యులకు ఉపదేశిస్తున్న ఏకైక పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారుఅనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్,
పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను, ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యూ లేటర్ లను పీఠాధిపతి ముఖ్య అతిధుల కలిసి సభలో అందించారు. తదుపరి పీఠం రూపొందించిన పలు కరదీపికలు, గ్రంధాలను సభలో ఆవిష్కరించారు.పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్ ద్వారా ఆధ్యాత్మిక తరగతుల్లో శిక్షణ పొందిన చిన్నారుల ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకు న్నాయి. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభను రంజింప చేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యం, బస్, ఆటో సౌకర్యాలను వృద్దులకు, దివ్యాంగులకు వీల్ చైర్ సదుపా యాలు కల్పించారు. ఈ సందర్భంగా 207 మంది నూతనంగా మంత్రోప దేశం పొందారు.ఈ  సందర్బంగా ఆదిత్య విద్యా సంస్థల అధినేత శేషారెడ్డి, రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ వై.డి. రామారావు, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్, గోదా వరి డెల్టా చైర్మన్ ఎం. సునీల్, బీజేపీ నేత ఎస్.వి. సత్యనారాయణ, బ్యాంక్ ఆఫ్ మహా రాష్ట్ర మేనేజర్ రాజ్ నందినీ పాండా, గీతావధాని యర్రంశెట్టిఉమామహేశ్వరరావు,పి.మంజుల తదితరులు పీఠాధిపతిని దర్శించు కున్నారు.ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు, పింగళి ఆనంద్ కుమార్, ఎవివి. సత్యనారాయణ,ఎన్ టివి. ప్రసాద వర్మ, కె.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments